Friday, 8 May 2020

Subhani

స్టేట్మెంట్సా .... కడుపు మంటా ??
*****************************
ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని , ఇప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కించపరచాలని , విమర్శించాలని కాదుగానీ ....అసలు ఎమిటీ ఈయన ఇలా తయారయ్యాడు ! ఈయన కేమయినా జబ్బు చేసిందా లేక ఏమయినా గబ్బు పట్టిందా ?
విశాఖపట్నం విషాద ఘట్టంలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటిస్తే .. "కోటి రూపాయలు ప్రకటిస్తే పోయిన మనుషులు తిరిగి వస్తారా" అని ఒకసారి , ....."కోటి రూపాయలు సరిపోతాయా" అని ఒకసారి , ..."అసలు డబ్బులు ఎవరు అడిగారు" ...అని మరోసారి స్టేట్మెంటా ?
అసలు ఇది అతని స్టేట్మెంటా ?.లేక కోటి ఇచ్చి నందుకు కడుపు మంటా ?
" ఐదుగురు ఐఏఎస్ లతో కమిటీ వేస్తే వాళ్ళేం చేస్తారు ? సైంటిఫిక్ , టెక్నికల్ అంశాలు వాళ్లకేం తెలుసు ? వాళ్ల సంగతి నాకు తెలియదా ?" అంటారు . అవును ఆయనకు వాళ్ల విషయం ఒకటే తెలుసు ... ఎక్కడో డ్రాఫ్ట్ అయిన కాగితాల మీద లెటర్ల మీద కళ్లు మూసుకుని సంతకాలు చెయ్యటం , ఆయన చేయించటం . బుర్రలతో పని ఎక్కడ చేయించారు . మనకు అసలు ఎక్సపర్ట్లు యనమల , అచ్చయ్య , బుచ్చయ్య లాటివాళ్లు కదా!!
ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గిర పనిచేస్తున్న IAS లు వళ్ళు దగ్గిర పెట్టుకుని , బుర్రల్ని పదును పెట్టుకుని ఆ ఆ రంగాలలో ఉన్న ఎక్సపర్ట్లను సంప్రదించి రిపోర్ట్ సమర్పిస్తారు .. గత కొన్ని నెలల నుండి IAS ల పనితీరు గమనిస్తే కదా తెలిసేది . మూతికి మాస్కులతో పాటు కళ్లకు గంతలు కట్టుకున్నవాళ్లకు ఏమి తెలుస్తుంది ఇప్పుడు IAS లు కరోనా విపత్తు తో ఎలా పనిచేస్తుంది . అవకాశం ఇవ్వాలే కానీ IAS లు ఎప్పుడూ ఎక్స్పర్ట్ లే !
" నేనుంటే నేరుగా ఫ్యాక్టరీలోకే వెళ్లేవాడిని " ... !!. అలా ఏ ముఖ్యమంత్రి చేసినా చెప్పకూడదు కానీ ఈ పాటికి మూడో రోజు అయ్యుండేది . స్టైరీన్ అంటేనే తెలీదు అంటునే నేరుగా లోపలకు పోతానంటాడేమిటీ ?ఏమి పీకుదామని !! ఇక్కడ దూరాల్సింది ఈయన కాదు ఎక్స్ఫర్ట్ లు . అంతా ఓవర్ యాక్షన్ !!
కనీసం... ఎవరి అదేశాలు కోసమూ ఎదురు చూడకుండా , ముఖ్యమంత్రి వచ్చేదాకా ఎదురు చూడకుండా 24 గంటల్లోగా ప్రాణ నష్టాన్ని , పరిస్థితి ని అదుపు చెయ్యగలిగిన అధికార యంత్రాంగాన్ని , వైద్యులను కనీసం మాట మాత్రం కూడ ఒక్క మెచ్చుకోలు మాట కూడా చెప్పని ముచ్చు మనిషి నుండి మంచి మాటలు ఏమి ఆశించగలం .
"గ్యాస్ లీకేజీ విషయాన్ని సీఎం చాలా లైట్ గా తీసుకున్నారు .." సీఎం స్వయంగా వచ్చి , చనిపోయిన వాళ్లకి కోటి ప్రకటించి , kgh కు వెళ్లి బాధితులను పరామర్శించి , కమిటీ ఏర్పటు చేసి ,
సీ ఎస్ ను , మంత్రుల బృందాన్ని అక్కడ పర్యవేక్షణకు పెట్టటం ఇందంతా ఆయనకు లైట్ గా అనిపించవచ్చు ... కానీ ఇలా చచ్చు స్టేట్మెంట్లు , విమర్శలు చేసుకుంటూ పోతుంటే ముందు ముందు ఈ ప్రతిపక్ష నాయకుడ్ని జనాలు చాలా లైట్ గా తీసుకునే ప్రమాదంవుంది ..
ఆయన గమనించుకొని పంథా మార్చుకుంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ మూతపడకుండా ఉంటుంది .
🥀 u b h a n i .

No comments:

Post a Comment